వనపర్తి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు తీవ్ర కరెంటు సంక్షోభం ఎదుర్కొంటున్నాయని వ్యవసాయశాఖ మం త్రి నిరంజన్రెడ్డి అన్నారు. ముఖ్యమం త్రి కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణలో కరెంటు ఇబ్బందులు లేకుండాపోయాయని అభిప్రాయపడ్డారు. గురువా రం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన ని వాసంలో మంత్రి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పం పిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దళితులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అసమర్థ వి ధానాల వల్ల ప్రస్తుతం దేశమంతా విద్యుత్ కోతలతో సతమతమవుతున్నదన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏ ర్పడితే చీకటిమయమవుతుందని చెప్పి న వారందరూ చీకటిలో కలిసిపోయారని ఎద్దేవా చేశారు. కరోనా విపత్తులో ప్రపంచం స్తంభించినా.. ప్రభుత్వ ఆ దాయం పడిపోయినా ఒక్క సంక్షేమ ప థకం ఆపలేదన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన దళితులు
టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఆకర్షితులై కాంగ్రెస్పార్టీకీ గుడ్బై చెప్పి సుమా రు 50 మంది దళితులు టీఆర్ఎస్ పా ర్టీలో చేరారు. వీరికి కండువా కప్పి మం త్రి నిరంజన్రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చేపట్టిన అనేక సం క్షేమ పథకాలు తమను ఆకర్షించాయని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చి న దళితబంధు పథకం ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు.
ఇతర పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగా చూసారని, సీఎం కేసీఆర్ మాత్రం సంక్షేమ పథకాలను అందిస్తూ దళితులను అభివృద్ధి చేస్తున్నారన్నారు.
కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
వనపర్తి, అక్టోబర్ 14 : పేదలకు రా ష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉం టుందని, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథ కం, అనారోగ్య బారిన పడి మెరుగైన వై ద్యం చేయించుకున్న బాధితులకు సీ ఎం సహాయనిధి అండగా ఉందని మం త్రి నిరంజన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మండలాలలకు చెందిన 247 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 87 మంది బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి విడుదలైన రూ.31.36లక్షల విలువ గల చెక్కులను గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు వద్ద అందజేశారు. రాష్ట్రంలోని ప్రజలందరూ బాగుండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అ ని మంత్రి తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి సహపంక్తి భోజన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ మ హేశ్వర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల రమేశ్, నాయకులు తిరుమల్, జోహెబ్, కోళ్ల వెంకటేశ్ పాల్గొన్నారు.