అచ్చంపేట, ఏప్రిల్ 6: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్కు విక్రయానికి వేరుశనగ రికార్డు స్థాయిలో వస్తున్నదని మార్కెట్ చైర్మన్ సీఎంరెడ్డి అన్నారు. మార్కెట్లో వేరుశనగను మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి మార్కెట్కు పంటను తీసుకువస్తున్న క్రమం లో ఇబ్బందులు, సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదారేండ్లలో ఎన్నడూ లేని వి ధంగా ఈసారి రైతులు పెద్ద ఎత్తున పంటను మార్కెట్కు తీసుకొస్తున్నారన్నారు. డివిజన్లో ని అచ్చంపేట, బల్మూర్, ఉప్పునుంతల, లింగా ల, అమ్రాబాద్, పదర మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రైతు లు వేరుశనగ విక్రయించేందుకు తీసుకురావడంతో మార్కెట్ రైతులతో నిండిపోతుందన్నారు. ప్రతిరోజు దాదాపు 350 మం ది రైతులు పంటను తీసుకొస్తున్నారన్నారు. 2500 క్వింటాళ్ల వ రకు కొనుగోలు చే యడం జరుగుతుందన్నారు. మంగళవారం క్వింటా ధర రూ. 5600 నుంచి రూ. 6400 వరకు వచ్చిందన్నారు. కా ర్యక్రమంలో మా ర్కెట్ కమిటీ వైస్ చై ర్మన్ గోపాల్నాయ క్, మార్కెట్ సిబ్బం ది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కొవిడ్-19 నియంత్రణలు : ముంబైని వీడుతున్న వలస కూలీలు
ఎయిర్టెల్-జియో మధ్య ఒప్పందం.. మూడు సర్కిళ్లల్లో స్పెక్ట్రం బదలాయింపు