రూ.280 చేరిన చికెన్ ధర
నిత్యం పెరుగుదలే..
బాలానగర్, ఏప్రిల్ 6 : చికెన్ ధరలు కొండెక్కుతున్నా యి. రోజురోజుకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వా రంలో రెండుసార్లయినా చికెన్ తినేవారు ప్రస్తుతం ఒక్క రోజు తినాలంటేనే ఆలోచిస్తున్నారు. సామాన్య ప్రజలైతే అటువైపే చూడడంలేదు. గతేడాది కరోనా సమయంలో కోడి మాంసమంటే దూరంపోయిన జనం.. ప్రస్తుతం పె రుగుతున్న రేట్లను చూసి బెంబేలెత్తుతున్నారు. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చికెన్ అందని ద్రాక్షగా మిగిలింది. వేసవికాలం కావడంతో ధరలు అ మాంతం పెరుగుతున్నాయి. విక్రయదారులు ఫౌల్ట్రీ రైతుల నుంచి తక్కువ ధరకే కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. బా లానగర్లో రెండు రోజుల కిందట కేజీ రూ.246 ఉండగా, ఆ మరుసటి రోజు రూ.249కి పెంచారు. ప్రస్తుతం చికెన్ ధర ఏకంగా రూ.280కి చేరుకున్నది. లేయర్ కోళ్ల కన్నా ప్రజలు బాయిలర్ కోళ్లంటేనే ఎక్కువ ఇష్టంగా తింటారు. అయితే వేసవికాలంలో 35 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత నమోదైతే బాయిలర్ కోళ్లు మరణించడమో లేక రోగాలు రావడమో జరుగుతుంది. దీంతో ఎక్కువ రోజులు కోళ్లను ఫారాల్లో ఉంచకుండా రైతులు తక్కువ ధరలకే కోళ్లను విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కోడి మాంసం ధరలు తగ్గాల్సి ఉండగా.. రోజురోజుకూ పెరగడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
45 దాటిన ఉద్యోగులు టీకా తీసుకోవాలి : కేంద్రం
58 శాతం కేసులు మహారాష్ట్రలోనే: కేంద్ర ప్రభుత్వం