హన్వాడ, ఏప్రిల్ 6: మండలంలోని వేపూర్ గ్రామంలో సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటానికి మంగళవారం నాయీబ్రాహ్మణులు క్షీరాభిషేకం చేశారు. నాయీబ్రాహ్మణులకు సెలూన్ షాపుల్లో 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అమలు చేస్తూ జీవో జారీ చేయడంతో ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏండ్ల తరబడి అవస్థలు పడుతూ జీవనం సాగిస్తున్నామని, ఉచిత విద్యుత్ ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రఫేల్ డీల్లో ముడుపులు : మోదీ సర్కార్పై రాహుల్ ఫైర్
సూపర్ స్ప్రెడర్గా కుంభమేళా : కఠిన నిబంధనలకు కసరత్తు!