తాండూరు రూరల్, సెప్టెంబర్ 17 : తాండూరు మండలంలోని హెల్త్ సెంటర్లలో శుక్రవారం చురుకుగా కొవిడ్ టీకా ప్రక్రియ కొనసాగింది. కరణ్కోట గ్రామంలో ప్రత్యేకాధికారి సంతోష్ పరిశీలించారు. గ్రామం లో రెండు సెంటర్లలో వ్యాక్సినేషన్ వేస్తున్నారని తెలిపారు. అర్హులం దరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు.
వ్యాక్సిన్తోనే కరోనా నివారణ
బషీరాబాద్, సెప్టెంబర్ 17 : మండలంలో ఇంటింటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. శుక్రవారం ఉప తాసిల్దార్ వీరేశ్బాబు, ఎంపీడీవో రమేశ్ బషీరాబాద్, నవల్గా, రెడ్డిఘణాపూర్ గ్రామాల్లో పర్య టించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసు కునేలా అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, వ్యాక్సిన్ తీసుకోవడంతోనే కరోనా వ్యాధిని అరికకట్టవచ్చన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
కొడంగల్, సెప్టెంబర్ 17: ఇంటింటికీ కరోనా టీకా కార్యక్రమాన్ని సద్వి నియోగం చేసుకొని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని వార్డు ప్రత్యేకాధికారి రాంచందర్ కోరారు. శుక్ర వారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు ఇంటింటి సర్వేతో పాటు టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా వేసుకోవడం వల్ల కరోనా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఎటువంటి అపోహలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని అవగాహన కల్పించారు.
రెండో రోజు 667 మందికి వ్యాక్సిన్
మర్పల్లి, సెప్టెంబర్ 17 : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎల్పీవో, మండల ప్రత్యేకాధికారిణి అనిత అన్నారు. శుక్రవారం ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్తో కలిసి మండలం లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించి పరిశీలిం చారు. రెండో రోజు 667 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో సోమలింగం, పంచాయతీ కార్య దర్శి లక్ష్మికాంత్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
మూడు నెలల అనంతరం రెండో టీకా
పూడూరు, సెప్టెంబర్ 17: రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి లోని సబ్ సెంటర్లలో శుక్రవారం వ్యాక్సిన్ పంపిణీ చేశారు. పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మూడు సబ్ సెంటర్లలో 310 మందికి, చన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాలుగు సబ్ సెంటర్లలో 300 మందికి వ్యాక్సిన్ వేశారు. మొదటి టీకా ఇచ్చాక మూడు నెలల అనంతరం రెండో టీకా ఇవ్వనున్నట్లు మండల వైద్యాధి కారి సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.