గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను సర్కారు పెంచింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు 30శాతం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనాలు జూన్ నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. దీంతో వికారాబాద్ జిల్లా పరిధిలో 825 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు మాట్లాడుతూ వేతనాల పెంపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని, ప్రజల సహకారంతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
పరిగి, సెప్టెంబర్ 28: పల్లెల ప్రగతికి విశేషంగా కృషి చేస్తున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలను సర్కారు పెంచింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాలు 30శాతం పెంచుతూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2021 నెల కు సంబంధించిన వేతనాలు జూలైలో చెల్లిం చే వాటికి ఈ పెంచిన వేతనాలు వర్తిస్తాయి. తమ వేతనాలు పెంచడం ద్వారా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. గౌరవ వేతనాలు పెంచడం ద్వారా వికారాబాద్ జిల్లా పరిధిలో 825 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు లబ్ది చేకూరనుంది. వేతనాల పెరుగుదలతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మరింత ఉత్సాహంగా గ్రామాల అభివృద్దిలో పాలు పంచుకోనున్నారు.
825 మందికి పెరగనున్న వేతనాలు…
గౌరవ వేతనాలు పెంచడం వల్ల వికారాబాద్ జిల్లా పరిధిలో 825 మంది ప్రజా ప్రతినిధుల వేతనాలు పెరగనున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులకు 30శాతం గౌరవ వేతనాలు పెం చుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 18 మంది జెడ్పీటీసీలు, 18 మం ది ఎంపీపీలు, ఇద్దరు జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులున్నారు. వారికి ప్రస్తుతం నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం అందుతుండగా సర్కారు గౌరవ వేతనాలు పెంచడం వల్ల వారికి నెలకు రూ. 13వేల చొప్పున గౌరవ వేతనం అందనుం ది. అలాగే సర్పంచ్లు, ఎంపీటీసీలకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనం ఉండగా రూ.1,500 పెంచి రూ.6,500లుగా నిర్ణయించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 566 మంది సర్పంచ్లు, 203 మంది ఎంపీటీసీలు, 18 మంది మండల కో-ఆప్షన్ సభ్యులకు గౌరవ వేతనాలు పెరగడం జరుగుతుంది. తద్వారా జిల్లా వ్యాప్తంగా స్థానిక సం స్థల ప్రజా ప్రతినిధుల వేతనాలు పెంపు 20 21 జూన్ నెల వేతనం నుంచి అమలులోకి రానున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
మరింత అంకితభావంతో పనిచేస్తాం
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచడం ద్వారా గ్రామాల అభివృద్దికి మరింత అంకితభావంతో పనిచేస్తాం. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్లు, ఎంపీ టీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీల గౌరవ వేతనాలు పెంచడం హర్షణీయం. పెరిగిన గౌరవ వేతనాలతో మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం కలుగుతుంది. గౌరవ వేతనం పెంచినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
జి. అశోక్వర్దన్రెడ్డి, వికారాబాద్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు