రామచంద్రాపురం, సెప్టెంబర్ 26 : పార్టీలో కార్యకర్తలే కింగ్ మేకర్లని, కార్యకర్తల కృషితోనే తామంతా నాయకులుగా ఎదిగామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో 111 భారతీనగర్, 112 ఆర్సీపురం డివిజన్ల నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. 111డివిజన్ అధ్యక్షుడిగా పృథ్వీరాజ్ (బూన్), ప్రధాన కార్యదర్శిగా నారాయణరెడ్డి, 112 డివిజన్ అధ్యక్షుడిగా ఆలూరి గోవింద్, ప్రధాన కార్యదర్శిగా బేకు యాదయ్యతోపాటు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమించారు. అనంతరం రెండు డివిజన్ల కార్యవర్గానికి సంబంధించిన జాబితాను జిల్లా ఇన్చార్జి బక్కి వెంకటయ్యకు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. పదవులు రాలేదని ఏ మాత్రం అధైర్యపడ్దొని, దశలవారీగా అందరికీ వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కార్యకర్తల కృషితోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కార్యకర్తలకు నిరంతరం అండగా ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని చెప్పా రు. బల్దియా ఎన్నికల్లో మూడు డివిజన్ల్లో పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలువడానికి కారణంగా కార్యకర్తలేనని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, ఎలాంటి గ్రూపులకు తావులేకుండా ఆర్సీపురం, భారతీనగర్లో గత కార్యవర్గం బాగా పనిచేశారని, నూతన కార్యవర్గ సభ్యులు కూడా బాగా పనిచేయాలని సూచించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి బక్కివెంకటయ్య మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నదన్నారు. గజ్వేల్, సిద్దిపేట సరసన పటాన్చెరు నియోజకవర్గం నిలిచిందన్నారు. టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవడానికి గ్రామ, మండల, పట్టణ, జిల్లా, రాష్ట్ర కమిటీలకు శ్రీకారం చుట్టింద న్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్ మాట్లాడుతూ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సూచనలతో డివిజన్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహానికి గురికాకుండా అందరితో ఏకాభిప్రాయం తీసుకొని నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశామన్నారు. అనంతరం మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్, దేవేంద్రాచారిని ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ కుమార్గౌడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, గ్రంథాలయ డైరెక్టర్ కుమార్గౌడ్, నాయకులు మోహన్రెడ్డి, ప్రమోద్గౌడ్, లక్ష్మారెడ్డి, సత్యనారాయణ, సత్తిరెడ్డి, నర్సింగ్రావు, గోపాలకృష్ణ, రమేశ్, రాకేశ్, కృష్ణకాంత్, సునీల్గౌడ్, శ్రావణ్ పాల్గొన్నారు.