తాండూరు రూరల్, సెప్టెంబర్ 24: ప్రభుత్వ దవాఖానాలు పేదల ఆరో గ్యానికి భరోసా కల్పిస్తున్నాయి. ప్రైవేట్ వైద్యం ఖర్చులు పెరిగి పోతుం డడంతో గ్రామీణ ప్రజలు ప్రభుత్వ దవాఖానాల వైపు పరుగులు పెడు తున్నారు. తాండూరు మండలం, జినుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందుతోంది. జినుగుర్తి పీహెచ్సీ పరిధిలో 9 ఉప కేంద్రాల్లోని 41 గ్రామాల్లో ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది, ఆశ కార్య కర్తలు వారాల వారీగా గ్రామాల్లో తిరుగుతూ పేదలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారు. ప్రధానంగా ప్రతి శనివారం గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహి స్తూ, పలు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా పోషకా హార దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల ‘ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్’ ఒకటో త్రైమాసికం, మూడో త్రైమాసికంలో ఉన్న గర్భిణులకు హిమోగ్లోబిన్ పరీక్షలతోపాటు బ్లడ్ గ్రూపింగ్, హెచ్ఐవీ, బ్లడ్ షుగర్, వీడీఆర్ఎస్, మలేరియా, స్కానింగ్ మొదలైన వైద్య పరీక్షలు చేస్తారు. మూడు నెలల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో 241 మంది గర్భవతులకు వైద్య సేవలందరించారు. అదేవిధగా 349 మందికి పరీక్షలు నిర్వహించారు. 144 మందికి బీసీజీ ఇంజక్షన్, 144 మందికి పోలియో, 168 మందికి డీపీటీ ఇంజక్షన్, 216 మందికి పెంటా వాలెంట్, 157 మందికి తట్టు సూది, 134 మందికి విటమిన్ -ఎ, 108 మందికి టీటీ ఇంజెక్షన్స్(5 సంవత్సరాల లోపు), 131 మందికి టీటీ (10 సంవత్సరాల లోపు), 80 మందికి టిటి (16 సంవత్సరాలలోపు) వారికి టీకాలు వేశారు. 21 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు.