ప్రతిపక్షాల వైఖరిపై టీఆర్ఎస్ నేతల మండిపాటు
వికారాబాద్, అక్టోబర్ 19 : నిరుపేదలైన దళితులను ఆర్థికంగా, సామా జికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవే శపెడితే…అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం ఏమిటని వికా రాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల మండిపడ్డారు. మం గళవారం వికారాబాద్ పట్టణంలోని క్లబ్ ఫంక్షన్హాలులో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం సీఎం అహర్నిశలు కృషి చేస్తుంటే ..ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచా రాలు చేస్తున్నారన్నారు. ఏనాడు కూడా దళితుల అభివృద్ధికి పాటు పడని పార్టీలు.. ముఖ్యమంత్రిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా జరుగబోయే ఎన్ని కల్లో టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్లు రామస్వామి, కృష్ణారెడ్డి, చందర్నాయక్, కృష్ణ పాల్గొన్నారు.
ప్రతి పక్షాల చేతకానితనం
ధారూరు, అక్టోబర్ 19: దళిత బంధు పథకాన్ని ఆపాలని కుట్ర చేయడం సరికాదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్ అన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం హుజురాబాద్ ఉప ఎన్నికల దృష్ట్యా ప్రవేశపెట్టింది కాదని, ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ధారూరు జడ్పీటీసి కోస్నం సుజాత పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, పీఏసీఎస్ హరిదాస్పల్లి చైర్మన్ వెంకట్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అంజయ్య పాల్గొన్నారు.
బీజేపివి కుట్ర రాజకీయాలు
కోట్పల్లి, అక్టోబర్ 19: దళితులను ఆర్థ్దికంగా అభివృద్ధి చేసేందుకు టీఆ ర్ ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే బీజేపీ నాయకులు దళిత బంధును ఆపేందు కు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు సుందరి అనిల్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీ ఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల, సర్పంచుల సం ఘం అధ్యక్షుడు వెంకటేశం, రైతుబంధు అధ్యక్షుడు సత్యం, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు పాల్గొన్నారు.
అడ్డుకుంటే ఉరుకునేది లేదు
మర్పల్లి, అక్టోబర్ 19: దళిత బంధును ప్రతిపక్షాలు అడ్డుకుంటే ఊరుకునేది లేదని జడ్పీటీసీ మధుకర్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి హెచ్చరిం చారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు నాయబ్గౌడ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అశోక్, మండల ప్రధానకార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు.
దళిత బంధుపై బీజేపీ కుట్ర
బంట్వారం, అక్టోబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆర్థిక పరిస్థితిని మెరు గు పరుద్దామని తెచ్చిన ‘దళిత బంధు పథకంపై బీజేపీ కుట్ర పన్నిందని టీఆర్ఎస్ మండల అద్యక్షుడు రాములు యాదవ్ దుయ్య బట్టారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడా రు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సిములు, పార్టీ నాయకులు మల్లారెడ్డి, చిన్న సుధాకర్గౌడ్, సుదర్శన్రెడ్డి, ఖాజాపాషా, శ్రీనివాస్రెడ్డి, చందుసింగ్ పాల్గొన్నారు.