పరిగి, సెప్టెంబర్ 16 : పార్టీ నాయకులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పరిగిలోని ఓ గార్డెన్లో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలు తెలిసిన ప్రజానాయకుడని, ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. త్వరలోనే ఈ పనులు పూర్తి చేసి పరిగి ప్రాంతంలోని భూములకు సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ ఇన్చార్జి జహంగీర్పాషా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను గ్రామస్థాయిలోనే తిప్పి కొట్టాలని సూచించారు. కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటన్నింటినీ ఎక్కడికక్కడే ఖండించాలన్నారు. పార్టీ అధిష్టానం ఏ పిలుపు ఇచ్చినా కార్యకర్తలు వెంటనే కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ప్రజాభిమానంలో మేటిగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు బాగున్నాయని కేంద్రం అభినందిస్తుంటే ఆ పార్టీ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కొప్పుల అనిల్రెడ్డి, ఎంపీపీలు కె.అరవిందరావు, సత్యమ్మ, మల్లేశం, జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి.హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, పీఏసీఎస్ చైర్మన్లు కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, కమతం శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఆయా మండలాల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.