మోమిన్పేట, సెప్టెంబర్ 16 : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జడ్పీ సీఈవో జానకీరెడ్డి అన్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురువారం జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్తో కలసి మోమిన్పేట, ఎన్కతల, టేకులపల్లి గ్రామల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఎండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు గ్రామంలో ఇంటింటికీ తిరిగి 18 ఎండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. మోమిన్పేట మండలంలో ముత్తం 9 వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రారంభమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు అంజిరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో శైలజా రెడ్డి, కోర్డినేటర్ లక్ష్మి, ఎంపీటీసీలు, సర్పంచులు, ఏఎస్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
నస్కల్ సెంటర్లో..
పరిగి టౌన్, సెప్టెంబర్ 16 : మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను సర్పంచ్ పద్మమ్మ ప్రారంభించారు. కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. పరిగి మున్సిపల్ నాలుగో వార్డులో ఇంటింటికీ వ్యాక్సిన్ పంపిణీని కౌన్సిలర్ వారాల రవీంద్ర ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేందర్, గ్రామ కార్యదర్శి రమేష్, హెచ్ఎం బాల్రాజ్, మహేందర్, సర్పంచ్ పరిగి గోపాల్, విజయ్రెడ్డి, ఆశావర్కర్ పాల్గొన్నారు.
బొంపల్లి పీహెచ్సీ సబ్ సెంటర్లో..
దోమ, సెప్టెంబర్ 16 : మండల పరిధిలోని బొంపల్లి పీహెచ్సీ సబ్ సెంటర్లో మొదటి డోసు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని గురువారం జడ్పీటీసీ నాగిరెడ్డి, ఎంపీపీ అనసూయతో కలిసి ప్రారంభించారు. దోమ గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాజిరెడ్డి, మోత్కూర్ గ్రామ పంచాయతీలో వైస్ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్ కేశవులుతో కలిసి మొదటి డోసు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంతునాయక్, ఎంపీటీసీలు నవాజ్రెడ్డి, రాములు, ఉప సర్పంచ్లు రఫీక్పాషా, శ్రీకాంత్రావు, ఎంపీడీవో జయరాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తాండూరు మండలంలో
తాండూరు రూరల్, సెప్టెంబరు 16 : తాండూరు మండలంలోని 9 హెల్త్ సబ్సెంటర్లలో కొవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా సబ్సెంటర్లలో 18 ఏండ్లు పైబడిన వారికి కొవిడ్ టీకా వేశారు. మండలంలోని ఎల్మకన్నె గ్రామంలో ఎంపీడీవో సుదర్శన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రవిగౌడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్కాపూర్ గ్రామంలో సర్పంచ్ విజయలక్ష్మి కొవిడ్ టీకా వేసుకున్నారు. అదేవిధంగా కరణ్కోట, సంగంకలాన్, అంతారం తదితర గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది.
బంట్వారం మండల కేంద్రంలో
బంట్వారం, సెప్టెంబర్ 16 : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, రొంపల్లి గ్రామాల్లోని వ్యాక్సినేషన్ సెంటర్లను ఎంపీడీవో బాలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ సెంటర్ల వివరాలను వైద్యాధికారి కృష్ణను అడిగి తెలుసుకున్నారు. తొరుమామిడి, రొంపల్లి, బంట్వారంలో వ్యాక్సిన్ సెంటర్లును నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి చెప్పారు. 102 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు.
చౌదర్పల్లిలో..
బొంరాస్పేట, సెప్టెంబరు 16 : చౌదర్పల్లిలోని ఆరోగ్య ఉప కేంద్రంలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఆయన వెంట సర్పంచ్ వెంకటమ్మ ఉన్నారు. మండలంలోని పది ఆరోగ్య ఉప కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి తెలిపారు. బొంరాస్పేట పీహెచ్సీలో టీకా పంపిణీని డిప్యూటీ డీఎంహెచ్వో ధరణికుమార్ పరిశీలించారు.
జీవన్గి గ్రామంలో..
బషీరాబాద్, సెప్టెంబర్ 16 : మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి బషీరాబాద్ ప్రాథమిక దవాఖాన వైద్యురాలు పవిత్ర ప్రారంభించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఆమె వెంట ఎంపీవో రమేశ్, గ్రామస్తుడు మాణిక్రెడ్డి ఉన్నారు.
కోట్పల్లి, సెప్టెంబర్ 16 : మండల కేంద్రంతో పాటు ఇతరత్రా పంచాయతీల్లో వైద్యురాలు హారిక సమక్షంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో డానియోల్తో కలిసి ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి సందర్శించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశావర్కర్లు వ్యాక్సిన్పై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
మర్పల్లి మండలంలో
మర్పల్లి, సెప్టెంబర్ 16 : మండలంలోని పట్లూర్, కొంషట్పల్లి తదితర గ్రామాలను ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్తో కలిసి కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను ఎంపీపీ లలిత రమేశ్ సందర్శించారు. పట్లూర్ వైద్యాధికారి అంబిక మాట్లాడుతూ మండలంలోని సబ్ సెంటర్లలో 772 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు మహమూదబీ, ఇందిరా అశోక్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, ఎంపీటీసీ సంగీత వసంత్, కో ఆప్షన్ సభ్యుడు సొహెల్, ఈసీ విఠల్, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ధారూరు మండల కేంద్రంలో..
ధారూరు, సెప్టెంబర్ 16: మండల కేంద్రంలోని సబ్ సెంటర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను వైస్ ఎంపీపీ విజయ్కుమార్తో కలిసి ధారూరు జడ్పీటీసీ సుజాత ప్రారంభించారు. ధారూరు ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని ధారూరు పీహెచ్సీతో పాటు నాలుగు సబ్ సెంటర్లలో 180మంది, నాగసముందర్ పరిధిలోని నాలుగు సెంటర్లలో 160మందికి వ్యాక్సిన్ వేసినట్లు ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రాజు, రమేష్బాబు తెలిపారు.
కులకచర్ల ఆరోగ్య ఉపకేంద్రాల్లో..
కులకచర్ల, సెప్టెంబర్ 16 : మండల పరిధిలోని వివిధ ఆరోగ్య ఉపకేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్యాధికారులు ప్రారంభించారు. కులకచర్ల ఎంపీడీవో నాగవేణి, సర్పంచ్ సౌమ్యారెడ్డి ఈవోఆర్డీ సుందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్య ఉపకేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.