తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కొడంగల్, సెప్టెంబర్ 15 : ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడి సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం కొడంగల్, పర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లోని ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు మాస్క్, శానిటైజర్లను పంపిణీ చేసిన అనంతరం గ్రామ శివారులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలంలో ర్యాలో కంపెనీ యంత్రంతో వరినాటు పద్ధతిని పరిశీలించారు. కంపెనీ యాజమాన్యం వారు యంత్ర వినియోగం, ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటివరకు వరి కోత యంత్రాలు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం నూతనంగా నాటు యంత్రం వచ్చిందని, రైతులు యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకొని సాగు చేపట్టాలని పేర్కొన్నారు. యంత్రంతో వరి నాటు చేసుకోవడం వల్ల ఎకరాకు రూ.200 ఖర్చు రావడం రైతులకు శుభసూచకంగా పేర్కొన్నారు. పట్టణంలోని జిల్లాపరిషత్ ఉన్నత బాలికల పాఠశాల, హస్నాబాద్లోని జడ్పీహెచ్ఎస్ 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మంత్రి సబితాఇంద్రారెడ్డి అందించిన డిక్షనరీలను పంపిణీ చేశారు. పర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లో వినాయక విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, సర్పంచ్లు ఫకీరప్ప, సయ్యద్ అంజద్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్దిలింగప్ప, సురేశ్, మల్లయ్య, ఏడీఏ వినయ్కుమార్, ఏవో బాలాజీ ప్రసాద్, ఏఈవో డాక్యానాయక్ పాల్గొన్నారు.
నిధులు సద్వినియోగం చేసుకోవాలి
నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిని సాధించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం వెటర్నరీ కార్యాలయ ఆవరణలోని సమావేశపు హాలులో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. సమావేశంలో రూ.2కోట్ల49లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం, రోడ్లు, ఖాళీ తదితర స్థలాల్లో మొక్కలు నాటాలని, పాత భవనాల కూల్చివేత, బావుల పూడికతీత వంటి పలు అంశాలపై తీర్మానాలను చేపట్టారు. మున్సిపల్ పరిధిలోని 33 వెంచర్లలో కేటాయించిన ప్రభుత్వ స్థలాలను కాపాడే చర్యలు చేపట్టాలని కమిషనర్ నాగరాజును ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ ఏడీ శషాంక్ మిశ్రా, ఏఈ హుస్సేన్లతో మాట్లాడి పనులపై ఆరా తీశారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.