పరిగి, సెప్టెంబర్ 15 : పరిగి మున్సిపల్ పరిధిలోని 11, 12, 14 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి నియామకపత్రాలను అందజేశారు. బుధవారం పరిగి మున్సిపల్ పరిధిలో వార్డుల్లో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలను పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పరిగి పట్టణ అధ్యక్షుడు సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 14వ వార్డు అధ్యక్షుడిగా అమీరొద్దీన్, 6వ వార్డు అధ్యక్షుడిగా ఫసియుద్దీన్, 12వ వార్డు అధ్యక్షుడిగా అక్బర్, 11వ వార్డు అధ్యక్షుడిగా నయీమ్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి వివరించారు.
ఏకగ్రీవంగా టీఆర్ఎస్ కమిటీలు
బొంరాస్పేట, సెప్టెంబర్ 15 : పార్టీ ఆదేశానుసారం బుధవారం బొంరాస్పేటలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా కమిటీలను ఎన్నుకున్నారు. రైతు కమిటీ అధ్యక్షుడిగా కారెగారి నర్సింహులుగౌడ్, ప్రధాన కార్యదర్శిగా బ్యాగరి బాలప్ప, బీసీ కమిటీ అధ్యక్షుడిగా బిచ్చన్న, ప్రధాన కార్యదర్శిగా మల్లప్ప, ఎస్టీ కమిటీ అధ్యక్షుడిగా సంతోష్నాయక్, ప్రధాన కార్యదర్శిగా దాసరి నర్సింహులు, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా గడ్డమీది కాశప్ప, ప్రధాన కార్యదర్శిగా బి.బిచ్చప్ప, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా జుట్టు అంజిలమ్మ, ప్రధాన కార్యదర్శిగా ఉప్పరి పద్మమ్మ, యూత్ కమిటీ అధ్యక్షుడిగా పి.మహేశ్యాదవ్, ప్రధాన కార్యదర్శిగా తలారి బసప్పలను ఎన్నుకున్నారు.
టీఆర్ఎస్ గ్రామ కమిటీలు ఎన్నిక
కులకచర్ల, సెప్టెంబర్ 15 : కులకచర్ల మండల పరిధిలోని కులకచర్ల, చాపలగూడెం, ఘనాపూర్, హన్మ్యానాయక్తండా, లాల్సింగ్తండా, బండమీదితండా గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఘణాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా హన్మంతు, కార్యదర్శిగా వార్ల బీరయ్య, హన్మ్యానాయక్తండా అధ్యక్షుడిగా రవి, కార్యదర్శిగా రాంచందర్, లాల్సింగ్తండా గ్రామాధ్యక్షుడిగా బాబు, కార్యదర్శిగా శ్రీశైలం, బండమీదితండా గ్రామాధ్యక్షుడిగా లక్ష్మణ్, కార్యదర్శిగా రాజు, చాపలగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చిట్టెల రాములు, కార్యదర్శిగా కృష్ణారెడ్డి, కులకచర్ల గ్రామాధ్యక్షుడిగా శ్రీశైలం, కార్యదర్శిగా జెట్టిగాళ్ల వెంకటయ్య ఎన్నికయ్యారు. చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కుర్వ రాములు, యువజన సంఘం అధ్యక్షుడిగా గజ్జి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
టీఆర్ఎస్ మండల అధ్యక్షులకు సన్మానం
తాండూరు, సెప్టెంబర్ 15 : తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం (అప్పు), తాండూరు మండల అధ్యక్షుడు రాందాస్, యాలాల మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షుడు రాములునాయక్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ను బుధవారం టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఘనంగా సన్మానించారు. నూతన కార్యవర్గ కమిటీ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమపై నమ్మకంతో పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
పూడూరు, సెప్టెంబర్ 15 : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని రైతు బంధు సమితి మండల కన్వీనర్ రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. పూడూరు మండలం తుర్కఎన్కెపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జి.రమేశ్, ఉపాధ్యక్షుడిగా సి.మల్లేశ్, కార్యదర్శిగా ఎం.నరేందర్, ఆయా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
పెద్దేముల్ మండల అధ్యక్షుడికి సన్మానం
పెద్దేముల్, సెప్టెంబర్ 15 : మండల అధ్యక్షుడిగా ఎన్నికైన కోహిర్ శ్రీనివాస్ యాదవ్ను మంబాపూర్ ఎంపీటీసీ శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ధన్రాజ్, గ్రామ యువజన అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, తింసాన్పల్లి యువకులు బుధవారం సన్మానించారు.
నేడు పరిగిలో పూడూరు మండల కమిటీ ఎన్నిక
పూడూరు, సెప్టెంబర్ 15 : టీఆర్ఎస్ పార్టీ పూడూరు మండల నూతన కమిటీ ఎన్నిక నేడు పరిగిలోని బృందావన్ గార్డెన్లో ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని ఎంపీపీ, జడ్పీటీసీ, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, గ్రామ కమిటీల అధ్యక్షులు, కమిటీల సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలందరూ సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.