పరిగి, సెప్టెంబర్ 15 : 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం కొవిడ్ వ్యాక్సినేషన్పై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ మాట్లాడుతూ కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3లక్షల మందికి వ్యాక్సినేషన్ జరిగేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న సబ్ సెంటర్, వాటి పరిధిలోని గ్రామాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేయాలని, ఇంటింటి సర్వే చేపట్టి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు డోర్లకు స్టిక్కర్లు అంటించాలన్నారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 1,51,600 మందికి మొదటి విడుతగా, 42,000 మందికి రెండో విడుతగా ఇప్పటివరకు వ్యాక్సినేషన్ చేసినట్లు చెప్పారు. మిగిలిన వారికి రెండు వారాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. గురువారం నుంచి గ్రామాలు, వార్డుల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని వైద్య అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, జిల్లా వైద్యాధికారి తుకారాం, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ను మరింత వేగం చేయండి
షాద్నగర్, సెప్టెంబర్15 : కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా కరోనా టీకాల పంపిణీని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లా ఉన్నత అధికారులకు సూచించారు. బుధవారం ఆయన జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్, జిల్లా ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆరోగ్య ఉప కేంద్రాల్లో సహితం టీకాలను వేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా మందికి టీకాలు వేయడం సంతోషకరమని చెప్పారు. రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికీ 19.9 లక్షల మందికి టీకాలు వేశామని వివరించారు. టీకా పంపిణీని నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని, అర్హత గల ప్రతి ఒక్కరికీ టీకాను అందిస్తామన్నారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా ప్రజలకు టీకాను వేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ జడ్పీ చైర్మన్ తీగల అనీతారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఉన్నత అధికారులు కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, శిక్షణ కలెక్టర్ కదిరవన్ పలాని, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.