కడ్తాల్, అక్టోబర్ 14 : సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోని సన్మార్గంలో నడవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంతోపాటు మైసిగండి గ్రామంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం కడ్తాల్, మైసిగండిలోని అమ్మవారు శ్రీమహిషాసురమర్ధినిదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మైసిగండి మైసమ్మతల్లి, దుర్గాదేవిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అమ్మవారి తీర్థప్రసాదాలను వారికి అందజేసి, ఎమ్మెల్సీతో పాటు ప్రజాప్రతినిధులను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. మండల కేంద్రంలోని దుర్గాదేవిని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి దర్శించుకొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలీ, ఈవో స్నేహలత, నాయకులు సురేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, హన్మానాయక్, వేణుగోపాల్, బిక్కునాయక్, చందోజీ, శేఖర్గౌడ్, నరేశ్నాయక్, ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మానవ మనుగడకు మొక్కలే ఆధారం
కడ్తాల్, అక్టోబర్ 14 : మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు భాస్కర్రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి డివైడర్పై భాస్కర్రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, హన్మానాయక్, వేణుగోపాల్, జహంగీర్అలీ, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, బిక్కునాయక్, రవీందర్రెడ్డి, నరేశ్నాయక్, కృష్ణ పాల్గొన్నారు.