వికారాబాద్/ధారూరు అక్టోబర్ 13: నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఓ వరంలా మారిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోట్పల్లి మండల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అదే విధంగా కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు సోషల్ వెల్ఫేర్ ద్వారా అంది స్తున్న ఫిక్స్డ్డిపాజిట్ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రజలకు విడతలవారిగా కార్పొరేట్ వైద్యం చేసుకునే వెసులుబాటు కల్పించడంలో సీఎం సహాయ నిధి చేయూతనందిస్తుందన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులు కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుంటూ ఆదర్శ దంపతులుగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ రూ.50వేల ఉన్న ప్రోత్సాహకాన్ని 2.25లక్షలకు పెంచి అందిస్తున్నారన్నారు. కార్య క్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం, ఎస్సీ వెల్ఫేర్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.