కొత్తూరు, ఏప్రిల్ 12 : టీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. కొత్తూరు మున్సిపాలిటీ తిమ్మాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ దంపతులు విజయలక్ష్మీరవీందర్, 100 మంది అనుచరులతో సోమవారం ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఎమ్మెల్యే స్వగ్రా మం ఎక్లాస్కాన్పేటలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, టీఆర్స్ మండలాధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేందర్గౌడ్, టీఆర్ఎఎస్ సీనియర్ నాయకుడు సత్యనారాయణ పాల్గొన్నారు.