షాబాద్, ఏప్రిల్ 12 : వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల వాల్పోస్టర్ను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…షాపింగ్ మాల్స్, దవాఖానలు, పరిశ్రమలు, పాఠశాలల వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, సంఘటనలు జరిగినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 101 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అగ్నిమాపక శాఖల అధికారులు వేరువేరు సూచనలతో ముద్రించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి శ్రీధర్రెడ్డి, అదనపు జిల్లా అగ్నిమాపక అధికారులు గిరిధర్రెడ్డి, విజయ్కుమార్, కేంద్ర అధికారులు శ్రీనివాస్, జగన్మోహన్ పాల్గొన్నారు.