బంట్వారం, సెప్టెంబర్ 11: మండలంలోని తొరుమామిడి, బస్వపూర్, బొపునారం, బండమీదిపల్లితోపాటు కర్ణాటక గ్రామాలు కుంచావరం, పోచారం, మగ్దంపూర్, జిల్వార్శా తదితర గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం భూమి కంపించిందని ప్రజలు భయాందోళనలు చెందారు. ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య బోరు మోటారు డ్రిల్లింగ్ చేసినట్లు ఐదారు సెకండ్ల పాటు భూమిలోంచి శబ్ధాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఏదైనా మైనంగ్ సౌండ్ అయి ఉంటుందని కొందరు, కాదు భూకంపం ప్రభావమేనని మరికొందరు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని కర్చికెడ్ గ్రామ పరిధిలో భూమి నుంచి శబ్ధాలు వస్తున్నాయి. అంతే తరుచుగా భూమిలోంచి శబ్దాలు రావడం పట్లు అక్కడి కలబురగి (గులబర్గా) జిల్లా అధికారులు ఆయా గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అప్పట్లో అక్కడి భూకంపల ప్రభావం తెలంగాణలోని తాండూరు పరిసరాల్లో సైతం ఉందని అధికారులు ధ్రువీకరించారు. శనివారం సైతం వచ్చింది భూకంపమేనని ఆయా ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
కొద్దిగా భూమి కదిలినైట్లెంది
ఇల్లు కట్టెందుకు బొపునారం పోయి పని చేస్తున్నాం. మధ్యా హ్నం 2 గంటల ప్రాంతంలో భూమి లోంచి కొద్ది సేపు డ్రిల్ వేస్తున్నట్లు సప్పుడు వచ్చింది. తరువాత రెండు మూడు సెకండ్లు భూమి తొట్టెల కదిలినట్లు కదిలింది. మళ్లీ ఎలాంటి సప్పుడుగాని, ఊపుడు గాని లేదు.
స్వల్పంగా భూకంపం వచ్చినట్లు తెలిసింది
ప్రాథమిక సమాచారం మేరకు మండలంలోని బొపునారం, తొరుమామిడి గ్రామాల్లో కొద్ది పాటిగా భూకంపం వచ్చినట్లు తెలిసింది. బస్వాపూర్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఎంత స్థాయిలో అన్నది ఇంకా మాకు సమాచారం అందాల్సి ఉంది.