చాదర్ఘాట్ :డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్టిట్యూషన్స్ యజమాని డాక్టర్ ఎస్.ఏల్.నారాయణ విద్యా భూషణ్ అవార్డును అందుకున్నారు. కరోనా విజృంభన సమయంలో డిజిటల్, సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహ, ప్రేరణా తరగతులు నిర్వహించడం ద్వారా ఆయన గుర్తింపు పొందారు. విద్య పై డాక్టర్ నారాయణకు ఉన్న నిబద్ధత, అభిరుచి, నిరంతర విలువలతో కూడిన విద్యను అందించాలనే తపనను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు మహాత్మాగాంధీ ఆకాశ్ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడు అర్జిత్కౌర్ తెలిపారు.
ఈ మేరకు జరిగిన అభినందన సత్కార కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ కోఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్ అభినందించారు. ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులకు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకునే విధంగా సహకరించి, వారి ఎదుగుదలకు డాక్టర్ నారాయణ కృషి చేశారని తెలిపారు.