మహేశ్వరం,ఆగస్టు5ః ప్రభుత్వ సంక్షేమపథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గతేడాది రోడ్డుప్రమాదంలో కాలు పోగొట్టుకున్నమండల పరిధిలోని ఉప్పుగడ్డతండాకు చెందిన మహేష్కు గురువారం ఎంపీల్యాండ్ క్రింద 5లక్షల 15వేల రూపాయల చెక్కు, రోడ్డుప్రమాదంలో మృతి చెందిన హర్షగూడ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త రమావత్ లక్ష్మణ్నాయక్ భార్య రమావత్ పద్మావతికి 5లక్షల రైతు బీమా, పార్టీ సభ్యత్వబీమా 2లక్షల చెక్కు, అదే గ్రామానికి చెందిన చెన్నయ్యకు 33వేల 500ల రూపాయల చెక్కును ఆమె అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన వారందరికి సంక్షేమఫలాలు అందిస్తున్న ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈశ్వర్నాయక్ మాజీ సర్పంచ్ జానారెడ్డి ఉపసర్పంచ్లు రవినాయక్, రాజునాయక్. తుక్కుగూడ కౌన్సిలర్ రవినాయక్, నాయకులు సీతారాం నాయక్, రాజుకుమార్నాయక్ వార్డు సభ్యులు జర్పులరాజు, ఇస్లావత్రవి, పెండ్యాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.