చిక్కడపల్లి :లైబ్రేరియన్స్ డే సందర్భంగా విద్యాశాఖ మంత్రి, గ్రంథాలయ శాఖ మంత్రి పి.సబితా ఇంద్రరెడ్డి ,గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ లు లైబ్రరీ జేఏసీ అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, నగర గ్రంథాలయం సంస్థ చైర్ పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, డైరెక్టర్ శ్రీనివాస్ చారి, లైబ్రరీ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు శాగంటి ఆయోద్య తదితరులు పాల్గొన్నారు.