తెలుగుయూనివర్సిటీ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మంగళవారం సాయంత్రం నాటకరంగ పరిశోధకులు డాక్టర్ పి.వి రమణ స్మారక ప్రసంగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీసీ కిషన్రావు, పంజాగుట్ట ఏసీపీ పి.వి గణేష్, లలిత కళాపీఠం డీన్ డాక్టర్ కోట్ల హనుమంతరావు తదితరులు పాల్గొని రమణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాటకరంగం వికాసానికి ఆయన చేసిన చేసిన సేవలను స్మరించుకున్నారు.