తెలుగుయూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం గురువారం ఎన్నికైంది. అధ్యక్షులుగా టి. ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా జి. వరహాలు దొర, ప్రధాన కార్యదర్శిగా ఎం.చంద్రశేఖరరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జి, చంద్రశేఖరరెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శిగా డి. ఆంజనేయులు, కోశాధికారిగా ఎన్.కె లక్ష్మీకాంత్లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా టి. రత్నకుమార్ డేనియల్, ఎం.డి ఖలీల్, ఆర్.జి గంగాధర్, ఎం.సుధీర్కుమార్, ఎం. వెంకటలీల ఎన్నికయ్యారు.