తుర్కపల్లి,సెప్టెంబర్19 : టీఆర్ఎస్ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆ పార్టీ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మండలాధ్యక్షుడిగా తన ఎంపికకు సహకరించిన మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ సుశీలారవీందర్, పీఏసీఎస్చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దూనాయక్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శాగర్ల పరమేశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదయ్యకు సన్మానం
మోటకొండూర్, సెప్టెంబర్ 19 : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా ఎన్నికైన బోట్ల యాదయ్యను ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, నాయకులు నర్సింహులుయాదవ్, జివిలికపల్లి వెంకటేశ్, బోట్ల శ్రీనివాస్, చల్లా విజయ్రెడ్డి, గంధమల్ల మధు, అయిలి నరేశ్ పాల్గొన్నారు.