ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
గణేశ్ మండపం వద్ద అన్నదానం
బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 16 : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత కలుగుతుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని 9వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, 8వ వార్డు ఇందిరమ్మ కాలనీలో పెద్దగట్టు మాజీ చైర్మన్ కడారి సతీశ్ యాదవ్తో కలిసి గణేశ్ మండపాల వద్ద ఎంపీ ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు. అన్నదానం చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. అదేవిధంగా 45వ వార్డులో గణేశ్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గండూరి కృపాకర్, 37వ వార్డులో టీఆర్ఎస్ నాయకుడు అనంతుల దుర్గాప్రసాద్ అన్నదానం చేశారు. ఆయా చోట్ల జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ కమిషనర్ పీ రామానుజులరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, బైరు వెంకన్న గౌడ్, బీరవోలు శ్రీహర్ష, టైసన్ శ్రీను, కుక్కడపు సాలయ్య, కుక్కడపు భిక్షం, మార్కెట్ డైరెక్టర్ సల్మామస్తాన్, అన్నదాత బొల్లంపల్లి వెంకటేశ్, ఇందిరమ్మ కాలనీ యూత్ సభ్యులు, ఆయా వార్డుల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సుఖఃసంతోషాలతో ఉండాలి : ఎమ్మెల్యే కిశోర్
తుంగతుర్తి/నూతనకల్/మద్దిరాల : విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. నూతనకల్, మద్దిరాల మండల కేంద్రాలతోపాటు తుంగతుర్తి మండలం గానుబండలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద ఆయన పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ భూరెడ్డి కళావతిసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, తుంగతుర్తి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, ఎంపీపీ గుండగాని కవితారాములు గౌడ్, సర్పంచ్ నల్లు రాంచంద్రారెడ్డి, మద్దిరాలలో వైస్ ఎంపీపీ బెజ్జెంకి శ్రీరాంరెడ్డి, సర్పంచ్ షేక్ ఇంతియాజ్జ్రాక్, ఉపసర్పంచ్ శేరి మధుసుదన్రెడ్డి పాల్గొన్నారు.
అన్నదానం అభినందనీయం : డీసీఎంఎస్ చైర్మన్ జానయ్య
సూర్యాపేట రూరల్లో : గణేశ్ మండపాల వద్ద అన్నదానం చేయడం అభినందనీయమని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని బాలెంల, దాస్తండా, పిల్లలమర్రి గ్రామాల్లో గణేశ్ విగ్రహాల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భగత్సింగ్ నగర్లో అన్నదానం..
సూర్యాపేట టౌన్లో : పట్టణంలోని 35వ వార్డు భగత్సింగ్ నగర్లోని గణేశ్ మండపం వద్ద మైనేని వెంకటేశ్వర్రావు-ఉమ దంపతులు అన్నదానం నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు బీరవోలు శ్రీహర్ష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్, నాయకులు కీసర వేణుగోపాల్రెడ్డి, మొరిగళ్ల ఉపేందర్, కమిటీ సభ్యులు ఇరిగి శ్రీనివాస్, పొదిల రమణ, రంజిత్, వంశీ, శివ పాల్గొన్నారు.