తిరుమలగిరి (సాగర్), ఏప్రిల్ 11 : టీఆర్ఎస్ పాలనలో కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. భగత్కు మద్దతుగా గౌడ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను ఆదివారం నాగార్జునసాగర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. గౌడ కులస్తులు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భగత్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నకిరేకంటి కాశయ్యగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల శంకర్గౌడ్, ఉపాధ్యక్షుడు బెజవాడ జగన్గౌడ్, కోశాధికారి బండారు గోవర్ధన్గౌడ్, జిల్లా గౌరవాధ్యక్షుడు లింగయ్యగౌడ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఒంట్లో వేడికి మాంచి విరుగుడు.. సబ్జా గింజలు