ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ కవిత
నడిగూడెం, ఏప్రిల్ 9 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకొని మద్దతు ధర పొందాలని ఎంపీపీ యాతాకుల జ్యోతి, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు సూచించారు. నడిగూడెం, తెల్లబల్లి సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం వారు ప్రారంభించారు. సర్పంచులు నాగలక్ష్మి, వెంకటనర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్లు రామారావు, వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ అధికారి ఆనంద్, ఏఓ రాజగోపాల్, వైస్ చైర్మన్ కొల్లు వీరయ్య, సీఈఓలు ప్రభాకర్, శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు నారాయణరావు, సత్యనారాయణ, రాంరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.
అనంతగిరి : మండలంలోని పాలవరం, గోండ్రియాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోదాడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్రావు, జడ్పీటీసీ ఉమ, ఏపీఎం లక్ష్మీకుమార్ పాల్గొన్నారు.
యతిరాజపురంతండాలో..
మేళ్లచెర్వు : మండలంలోని యతిరాజపురంతండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బాణోతు లక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సీసీ కృష్ణమోహన్, ఏఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని కాపుగల్లు పీఏసీఎస్ చైర్మన్ నంబూరి సూర్యం సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీ వాసు, ఇందిర, సత్యనారాయణ, పాపారావు, సుబ్బారావు, కోటి, రమేశ్, వీరబాబు, రైతులు పాల్గొన్నారు.
మోతె : మండలంలోని సిరికొండ, సర్వారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఉర్లుగొండ, రాఘవాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ముప్పాని ఆశాశ్రీకాంత్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. డీసీఓ జి.శ్రీనివాస్, డీసీఏఓ నాగేశ్వర్రావు, సిరికొండ చైర్మన్ కొండపల్లి వెంకట్రెడ్డి, సర్వారం చైర్మన్ శ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్లు మదార్, మల్సూర్, అధికారులు కృష్ణ, అమరేందర్, సీఈఓలు అనంతరెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
మునగాల : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఎంపీపీ ఎలక బిందు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సుంకర అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని రేపాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమణ, రైతులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా