సూర్యాపేటరూరల్, ఏప్రిల్ 9 : రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. మండలంలోని ఇమాంపేట, టేకుమట్ల, కేటీ అన్నారం, కాసరబాద, రామారం, యండ్లపల్లి, సోలిపేట, బాలెంల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం వారు ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, రైతు బంధు సమితి రాష్ట్ర సభ్యుడు గుడిపూడి వెంకటేశ్వర్రావు, మండల కన్వీనర్ కక్కిరేణి నాగయ్య, సభ్యురాలు మాలి కవిత, ఏపీఎం వెంకయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రైతులు వినియోగించుకోవాలి
తిరుమలగిరి(తుంగతుర్తి): ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. శుక్రవారం తిర్మలగిరి, అన్నారం, వెలుగుపల్లి, కేశవాపురం, వెంపటి, గానుగుబండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు అనూక్, అనిత, నల్లు రాంచంద్రారెడ్డి, పద్మ, నాయకులు గుండగాని రాములుగౌడ్, తునికి సాయిలు, దొంగరి శ్రీను, సుధాకర్, ఐకేపీ ఏపీఎం ఆనంద్ పాల్గొన్నారు.
అర్వపల్లి : మండలంలోని తిమ్మాపురంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్పర్సన్ మారిపెద్ది మంగమ్మ శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ స్టాలిన్రెడ్డి, సీఈఓ సత్యనారాయణ, పాలసంఘం చైర్మన్ వేణుధర్రెడ్డి, ఏఈఓ నేరెళ్ల సత్యం, టీఆర్ఎస్ నాయకులు కందుల దశరథరామారావు, తండ లింగమూర్తి, జీడి ఉపేందర్, సందీప్రెడ్డి, సుజాత, వీరస్వామి పాల్గొన్నారు.
చివ్వెంల : మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కౌన్సిలర్ వేములకొండ పద్మ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకన్న, మల్లేశ్, ఏఈఓ సాయిప్రసాద్, డైరెక్టర్లు పద్మ, ఐలమ్మ పాల్గ్గొన్నారు.
పెన్పహాడ్ : మండల కేంద్రంతో పాటు భక్తళాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య ప్రారంభించారు. మండలంలోని లింగాల, దూపాడ్, దోసపహాడ్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాతాల జానకీరాంరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమములో వైస్ చైర్మన్ వావిళ్ల రమేశ్, సర్పంచులు మామిడి వెంకన్న, దొంగరి సుధాకర్, బిట్టు నాగేశ్వర్రావు, తాసీల్దార్ శేషగిరిరావు, తూముల ఇంద్రసేనారావు, పొదిల నాగార్జున, జుట్టకొండ గణేశ్, మామిడి అంజయ్య, రాధాకృష్ణ, నెమ్మాది కృష్ణ పాల్గొన్నారు.
తిరుమలగిరి : మండలంలోని వెలిశాల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మూల అశోక్రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, ఏపీఎం నర్సయ్య పాల్గ్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ : మండలంలోని ఏనుబాముల గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ ప్రారంభించారు. కార్యక్రమం లో సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ పన్నాల సంజీవరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొల్లె జానయ్య, గుంషావలి, కృష్ణారెడ్డి, సర్పంచులు మీరా, జావిద్, రవీందర్ నాయకులు పాల్గొన్నారు.
నూతనకల్ : మండలంలోని యడవెల్లి, తాళ్లసింగారం, సోమ్లాతండా, వెంకేపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల నరేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చూడి లింగారెడ్డి, సర్పంచులు కొచ్చెర్ల బాబు, గుగులోతు శంకర్నాయక్, కృష్ణప్రశాంత్, మట్టపెల్లి గంగయ్య, ఏపీఎం కర్ణాకర్, సీసీలు నాగార్జున్రెడ్డి, ముత్తయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బడి మానేసి ట్రేడింగ్.. నేడు యువ కుబేరుడు
రైళ్లలో రద్దీ సాధారణంగానే ఉంది : దక్షిణ మధ్య రైల్వే జీఎం