ఆర్కేపురం: రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయానికి భక్తులు పొటెత్తారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సన్నిధిలో అభిషేకం, విశేష అర్చనలు నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా యాగశాలలో హవన కార్యక్రమం, సువర్ణపుప్పార్చన, పూర్ణాహుతి, గోపూజ, సహహస్రదీపాలంకరణ, హోమం, సాయంత్రం సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.