దుబ్బాక/ మిరుదొడి/ రాయపోల్/ కొమురవెల్లి/ జగ దేవ్పూర్/ నారాయణరావుపేట, ఆగస్టు 12 : టీఆర్ఎస్తోనే ఎస్సీ, ఎస్టీలకు తగిన న్యాయం జరుగుతున్నదని జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక మండలం పద్మనాభంపల్లిలో దళితవాడలలో ఎంపీడీవో భాస్కరాశర్మతో కలిసి పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి, సమస్యలతోపాటు ప్ర భుత్వ పథకాల సద్వినియోగం అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కండ్లకోయ పరశురాములు, ఎంపీవో శ్యాం, గ్రామ కార్యదర్శి స్వామి, వార్డు సభ్యులు ఉన్నారు.
మిరుదొడ్డి మండలంలోని చెప్యాల, వీరారెడ్డిపల్లి జంగపల్లి, అల్మాజీపూర్, ఖాజీపూర్ గ్రామాల్లోని దళిత వాడలను ఎంపీపీ గజ్జెల సాయిలు అధికారులతో కలిసి సందర్శించి, సమస్యలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి, సర్పంచ్లు మాచపురం లక్ష్మీయాదగిరి, వెంకట్రెడ్డి, కంచం యాదగిరి, మంజూల, మమతా మాధవ్, ఎంపీటీసీలు బాలమల్లేశంగౌడ్, భాగ్యలక్ష్మీచిరంజీవి పాల్గొన్నారు.
రాయపోల్ మండలంలోని ముంగిస్పల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఎంపీపీ అనితాశ్రీనివాస్ పర్యటించి, దళితుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు స్వామి, రంగమ్మ, ఎంపీడీవో రాజేశ్కుమార్, ఏంపీవో నర్సింహరావు, ఏఈలు శరత్, శశికిరణ్ ఉన్నారు.
కొమురవెల్లి మండలంలోని రాంసాగర్లో ఎంపీడీవో అనురాధ ఆధ్వర్యంలో అధికారులు సర్వే నిర్వహించారు. కార్యక్రమలో సర్పంచ్ తాడూరి రవీందర్, ఏఈలు దివ్య, సత్యం, శివకుమార్, ఎంపీవో వీరరాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ అక్కెనపల్లి విజయ పాల్గొన్నారు.
జగదేవ్పూర్ మండల కేంద్రంతోపాటు జంగంరెడ్డిపల్లె, నిర్మల్నగర్, రామచంద్రపూర్ దళిత బస్తీలో ఎంపీపీ బాలేశంగౌడ్ అధికారులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమం లో మండల ప్రత్యేక అధికారి సరోజిని, సర్పంచ్లు లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో మల్లికార్జున్, ఎంపీవో శ్రీనివాస్వర్మ, మండల కోఆప్షన్ సభ్యుడు ఎక్బాల్ పాల్గొన్నారు.
నారాయణరావుపేట మండలంలోని కోదండరావుపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లోని దళిత కాలనీల్లో ఎంపీడీవో మురళీధర్శర్మ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఆయన వెంట ఎంపీవో శ్రీనివాస్, ఏఈ సిద్దార్థ, సర్పంచ్లు మంజులాశ్రీనివాస్, మౌనిక భాస్కర్రెడ్డి, కార్యదర్శులు రేఖ, శ్రీధర్ ఉన్నారు.