చిన్నశంకరంపేట,17ఏప్రిల్ : ఎక్కడో ఉన్న గోదావరి జలాలను మెదక్ జిల్లాకు తరలించి, సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా నిలిచారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. హల్దీవాగు ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు చిన్నశంకరంపేట మండలం ధర్పల్లి గ్రామ శివారులో మెదక్ నియోజవర్గంలోకి ప్రవేశించాయి. శనివారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ధర్పల్లి చెక్డ్యాం వద్ద గోదావరి జలాలకు సారె చీరెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలతో పని లేకుండా రోహిణి కార్తిలో వర్షాకాలం పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. ఎండకాలంలో సైతం సీఎం కేసీఆర్ కృషితో మత్తడులు, చెక్డ్యాంలు గోదావరి జలాలతో పొంగిపొర్లుతున్నాయన్నారు. గోదావరి జలాలతో చిన్నశంకరంపేట, వెల్దుర్తి మండలాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 70 ఏండ్లలో జరుగని అభివృద్ధి సీఎం కేసీఆర్ ఏడు ఏండ్లలో చేసి చూపారన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత కరెంటును అందిస్తున్నారని, రైతుల శ్రేయస్సు కోసం రైతుబీమా, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీఈ నాగారాజు, జడ్పీటీసీ పట్లోరి మాధవి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు పట్లోరి రాజు, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఏవో శ్రీనివాస్, సర్పంచ్లు సిద్ధిరాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మీనా, యాదగిరి యాదవ్, ఎంపీటీసీ రాణమ్మ, సింగిల్విండో చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణ, నాయకులు లింగారెడ్డి, మహిపాల్రెడ్డి, సుధాకర్, స్వామి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీ మాజీ చీఫ్ ఇంజినీర్ వెంకటాచారి ఇకలేరు
MI vs SRH: మెరిసిన రైజర్స్ బౌలర్లు.. ముంబై స్కోర్ 150