సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకుల కోసం నీటి పడవ బగ్గి వాహనం ఏర్పాటు
త్వరలో మంత్రి హరీశ్రావు చేతులమీదుగా ప్రారంభోత్సవం
ప్రశాంత్నగర్, ఆగస్టు 14: సిద్దిపేట కోమటి చెరువు (మినీట్యాంక్బండ్) రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కృషితో రాష్ర్టానికే ఆదర్శంగా రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే కోమటి చెరువుపై మ్యూజికల్ ఫౌంటెన్, బతుకమ్మ విగ్ర హం, జింక ప్రతిమ, మిషన్ భగీరథ పైలాన్, స స్పెన్షన్ బ్రిడ్జి వివిధ రకాల బోట్లు, జిప్ సైక్లింగ్, ఓపెన్ జిమ్స్, యోగా సెంటర్, రాక్ గార్డెన్, అ డ్వెంచర్స్, సెల్ఫీ స్పాట్లకు డాల్పిన్, వాటర్ ఫౌంటెన్స్, చిన్న పిల్లలకు ఉల్లాసాన్నిచ్చే ఆటలు ఏర్పాటు కాగా, రాష్ర్టానికే తలమానికంగా నెక్లెస్ రోడ్డు రూపుదిద్దుకున్నది. వీటన్నింటితో పాటు తాజాగా కొత్తగా నీటి పడవ, బగ్గివాహనం ఏర్పాటు చేయనున్నారు. వీటిని త్వరలోనే ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించనున్నారు.