పరిసరాలు బాగుంటేనే ప్రజారోగ్యం బాగుంటుంది. పరిసరాలు బాగుండాలంటే ప్రజలకు చెత్త నిర్వహణపై అవగాహన ఎంతైనా అవసరం. ఎక్కడపడితే అక్కడ చెత్తవేస్తే అనర్ధాలు తప్పవు. ఈ అంశాలపై ప్రజలను చైతన్యం చేయడానికి దేశంలో బెంగళూరులో తర్వాత రెండో ‘స్వచ్ఛ బడి’ని సిద్దిపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేశారు. చెత్త పునర్వినియోగం.. చెత్త నుంచి సంపద సృష్టించడం..చెత్త సేకరణ.. ప్రజారోగ్యం.. తడి, పొడి, హానికర చెత్తను వేరుచేయడం, ప్లాస్టిక్ నివారణ.. చెత్తతో ఇండ్లలోనే ఎరువు తయారు చేసే విధానాలను బడిలో విద్యార్థులకు మాదిరిగా ఇక్కడ నేర్పిస్తున్నారు. సిద్దిపేట స్వచ్ఛబడి అన్ని బల్దియాలకు ఆదర్శంగా మారింది. ఇప్పటి వరకు సుమారుగా 5వేల మందికి పైగా దీనిని సందర్శించారు.దీనికోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. గూగుల్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ తదితర వాటితో స్వచ్ఛబడి పాఠాలు నేర్చుకోవచ్చు.
సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులు ఉన్నాయి. 45వేలకు పైగా జనావాసాలు ఉన్నా యి. ఈ వార్డుల నుంచి ప్రతిరోజూ ఇంటింటా తడి, చెత్తను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు. తడి, పొడి, హానికర చెత్తగా మూడు రకాలు విభజిస్తారు. వారంలో మంగళ, శుక్రవారం రోజుల్లో పొడి చెత్తను, మిగతా రోజుల్లో తడి చెత్తను ఇంటింటా సేకరిస్తున్నారు. ఇండ్ల నుంచి, హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇలా ప్రతి దగ్గరి నుంచి రోజుకు 54.45 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో తడి చెత్త ఇండ్ల నుంచి 16 మెట్రిక్ టన్నులు కాగా, హోటళ్లు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు తదితర వాటి నుంచి 10.80 మెట్రిక్ టన్నులు, మొత్తంగా తడి చెత్త 26.80 మెట్రిక్ టన్నులు సేకరిస్తున్నారు. పొడి చెత్త ఇండ్ల నుంచి 14 మెట్రిక్ టన్నులు, వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి 2.50 మెట్రిక్ టన్నులు, మొత్తం 16.50 మెట్రిక్ టన్నులు సేకరిస్తున్నారు. సీల్ట్ 6.85 మెట్రిక్ టన్నులు, బయో మెడికల్ వేస్ట్ 1.40 మెట్రిక్ టన్నులు, హానికర చెత్త 1.20, ఇతర వ్యర్థాలు 1.20 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రతిరోజు సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన చెత్తను మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోతున్నది. ఇలా పేరుకు పోయిన చెత్తను ఏం చేయలేమా? అనే ప్రశ్న మంత్రి హరీశ్రావుకు కలిగింది. బెంగళూరులో 2018లో స్వచ్ఛగ్రహ చెత్త విలువను తెలియజేసే ఒక పాఠశాల ఉందని తెలుసుకున్నారు. ఇది దేశంలోనే తొలిది కావడం.. అక్కడ ఎలా చేస్తున్నారు.. అని సిద్దిపేట నుంచి అధికారులు బృందంగా అక్కడికి వెళ్లి, చెత్తను ఎలా పునర్వినియోగం ఎలా చేస్తున్నారో స్వయంగా చూశారు. అక్కడి ఫలితాలు బాగా ఉండడంతో సిద్దిపేటలో ‘స్వచ్ఛబడి’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేటలో చెత్తకు శాశ్వత పరిష్కారంతో పాటుగా చెత్త పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇక్కడ దీనిని ప్రారంభించారు. చెత్తను పునర్వినియోగం చేయడం ద్వారా సంపదను సృష్టిస్తున్నారు.
ప్రతిరోజూ ఇంటింటా సేకరించిన చెత్తను పున ర్వినియోగం చేయడం ఎలానో తెలియజేసేందుకు, దీని నుంచి సంపదను ఎలా సృష్టించవచ్చో ప్రజలకు స్వచ్ఛబడి అవగాహన కల్పిస్తున్నది. ఈ స్వచ్ఛ బడిని 2 వేల గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో వర్మీకంపోస్టు యార్డు, పక్కనే పార్కు, డిజిటల్ తరగతి గది, వార్డు కంపోస్టు, హోం కమ్యూనిటీ కంపోస్టింగ్ తదితర వాటిని ఏర్పాటు చేశారు. సేంద్రి య ఎరువుల ద్వారా పండించే కూరగాయల తోటను ఏర్పాటు చేశారు. పనికిరాని వస్తువులతో చక్కగా పరి కరాలను తయారు చేశారు. ఖాళీ సీసాలతో స్వాగత తోరణాలు, వెదురు బొంగులతో కాంపౌండ్ వాల్.. ఇలా ఎన్నో రకాలుగా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ప్లాస్టిక్ చెత్తతో కలిగే అనర్థాలను తెలిపే బొమ్మలు వేశారు. ఈ స్వచ్ఛబడిలో చెత్తను మూడు రకాలుగా విభజిస్తారు. వీటిలో నుంచి హానికర చెత్తను తీసివేసి, మిగతా చెత్తను ముక్కలు ముక్కలుగా చేసి కంపోస్టు ఎరువు తయారు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటిలో వేస్తారు. అక్కడే ఒక గోశాలను ఏర్పా టు చేశారు. ఆవుల నుంచి వచ్చిన పేడను ఒక దగ్గర వేసి లిక్విడ్గా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన దానిని ఈ సేంద్రియ ఎరువు తయారీకి ఉపయోగిస్తున్నారు. సేంద్రియ ఎరువు తయారైన తర్వాత దానిని ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత జల్లెడ పట్టి, వచ్చిన దాన్ని ఒక దాంట్లో వేసి పెడతా రు. జాలి పట్టగా మిగిలిన దానిని మరో దాంట్లో పోసి పెడతారు. ఇలా సేంద్రియ ఎరువు తయారయ్యాక ఇంటి పేరటి తోటలకు, మిద్దె తోటలకు ఇస్తారు. రైతులకు వ్యవసాయానికి కూడా ఈ ఎరువులను అందిస్తారు. ప్రతిరోజూ వార్డు నుంచి ప్రజలను తీసుకువచ్చి అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ ఎరువు, కెమికల్ ఎరువుల ద్వారా పండిన కూరగా యలు ఎలా ఉన్నాయో ప్రజలకు అవగాహన కల్పిస్తు న్నారు. డిజిటల్ తరగతి గదిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. స్వచ్ఛబడి కోసం ప్రత్యేకం గా యాప్ను రూపొందించారు. ఈ స్వచ్ఛబడి ఇప్పుడు గూగుల్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ తదితర వాటిలో వస్తున్నది.