సిద్దిపేట జిల్లా/సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 10 : దశాబ్దాలుగా సిద్దిపేట ప్రాంత ప్రజల సాకారం నెరవేరింది. సిద్దిపేట జిల్లా ఏర్పడి నేటికీ ఐదేండ్లు పూర్తయింది. సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి జిల్లా కేం ద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. గడిచినా ఐదేండ్లలో జిల్లా అన్నిరంగాల్లో పురోగామి సాధించింది. దశాబ్దాలుగా సిద్దిపేట ప్రాంత ప్రజల సాకారం నెరవేరింది. సిద్దిపేట జిల్లా ఏర్పడి నేటికీ ఐదేండ్లు పూర్తయింది. సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి జిల్లా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. సిద్దిపేట జిల్లాలో మొదట 22 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లతో ఆవిర్భవించింది. జిల్లా ఏర్పడిన తర్వాత నారాయణరావుపేట, ధూళిమిట్ట మండలాలుగా ఏర్పడ్డాయి. దీంతో సిద్దిపేట జిల్లాలో నేడు 499 గ్రామ పంచాయతీలు, 3 రెవెన్యూ డివిజన్లు, 24 మండలాలు ఉన్నాయి. జిల్లా ఏర్పడిన నాటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావుల ప్రత్యేక కృషితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా ముందంజలో ఉన్నది.
మెడికల్ కళాశాల ఏర్పాటుతో కార్పొరేట్ వైద్యం
సిద్దిపేటను జిల్లా ఏర్పాటు చేసిన రోజు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో సుమారు 28 ఎకరాల్లో రూ.135 కోట్లతో కాలేజీ భవనం జీ+3 పద్ధతిలో, బాలురు, బాలికలకు హాస్టల్ను, కాలేజీ సిబ్బంది క్వార్టర్స్ను జీ+5 పద్ధతిలో నిర్మించారు. రూ.260కోట్లతో 1000 పడకల దవాఖాన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సిద్దిపేట ఏరియా దవాఖాన జీ+4 పద్ధతిలో ప్రాగంణంలో కార్పొరేట్ దవాఖానలను తలపించేలా నిర్మించారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా కేంద్రంలో అత్యధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
సరికొత్త అందాలతో కోమటి చెరువు..
పట్టణానికి సరికొత్త అందాలను కోమటి చెరువు తీసుకువచ్చింది. పట్టణ ప్రజలు, ఇతర జిల్లాల నుంచి సిద్దిపేటకు వచ్చే వారికి మంచి ఆహ్లాదాన్ని అందిస్తూ కోమటి చెరువు పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంది. చెరువు వద్ద నిర్మించిన ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
సిద్దిపేట అభివృద్ధికి హేతువు రింగ్రోడ్డు
పట్టణానికి భవిష్యత్లో పెరిగే అవకాశాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడే పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డును ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం కావడం పట్టణానికి ట్రాఫిక్ రద్దీ పెరగడంతో బైపాస్ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా విస్తరించారు. రూ.50కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా 14.5 కిలో మీటర్ల మేర గల రోడ్డును విస్తరించి మధ్య డివైడర్, లైటింగ్, బ్రిడ్జిలను నిర్మించారు.
ప్రజల సౌకర్యార్థం విశాలమైన భవనాలు..
పరిపాలన ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలో అత్యం త విశాలమైన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. సుమారు 50ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 2 పద్ధతిలో రూ.54 కోట్లతో నిర్మించారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.15 కోట్ల వ్యయంతో నూతన పోలీస్ కమిషనరేట్ భవనం నిర్మించారు. అన్ని విభాగాల పోలీస్ కార్యాలయాలను ఒకే దగ్గర ఉండేలా ఈ కమిషనరేట్ కార్యాలయాన్ని నిర్మించారు.
అభివృద్ధి పథంలో నారాయణరావుపేట
నారాయణరావుపేట, అక్టోబర్ 10 : మండల కేంద్రానికి వెళ్లాలంటే గతంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ, సిద్దిపేట జిల్లా ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో నారాయణరావుపేట మం డల కేంద్రంగా ఆవిర్భవించింది. నారాయణరావుపేటలో మండల ప్రజాపరిషత్, తహసీల్ కార్యాలయాల ఏర్పాటు చేశారు. దూరాభారం తగ్గి మండల కేంద్రంలోనే సమస్యలు పరిష్కారం కావడంతో ప్రజలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.