గజ్వేల్, సెప్టెంబర్ 9 : మట్టి గణపతినే పూజించాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. గురువారం గజ్వేల్లో ఇందిరాపార్కు వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో, రామాలయం వద్ద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వినాయకుడిని పూజించి అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. మట్టి గణపతులను పూజించడంతో పర్యావరణానికి, చెరువుల్లోని జీవరాశులకు హాని కలుగకుండా ఉంటుందన్నారు. మట్టి గణపతికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట, ప్రజ్ఞాపూర్లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియొద్దీన్, కమిషనర్ వెంకటగోపాల్, కౌన్సిలర్లు బబ్బూరి రజిత, ఉప్పలమెట్టయ్య, వరలక్ష్మి కనకయ్య, అర్చన శివ, ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో గోళిసంతోష్గుప్తా, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నాచారం బోర్డు సభ్యుడు నంగునూరి సత్యనారాయణ, నాయకులు నంగునూరి విజయ్లు మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో కుమ్మరి సంఘం నాయకులు నాగపురిబాబు, సత్యనారాయణ, స్వామి, లయన్స్క్లబ్, ఆర్యవైశ్యసంఘం సభ్యులు పాల్గొన్నారు.