పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు, సెప్టెంబర్ 28 : యువజన నాయకులకు టీఆర్ఎస్లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్ యువత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నియోజకవర్గ స్థాయి యువజన విభాగం అధ్యక్షుడిగా శ్యాంసుందర్రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా చెన్నారెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ను పటిష్టం చేసేందుకు యువకులు సైనికుల్లా పనిచేయాలన్నారు. కష్టపడి పని చేసే ప్రతిఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువత పాత్ర కీలకమని, వారి పోరాటం దేశాన్నే ఆకర్షించిందని గుర్తు చేశారు. యువత తల్చుకుంటే కానిది లేదన్నారు. టీఆర్ఎస్కు యువతే వెన్నుముక అని, సీఎం కేసీఆర్ యువతను ప్రోత్సహిస్తున్నారన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అందరం శ్రమిద్దామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. యువతను ప్రోత్సహించడంలో టీఆర్ఎస్ ఎప్పుడు ముందుంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారాలంటే యువత అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పార్టీ శ్రేణులు విద్యార్థి విభాగం, యువత విభాగంలో కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల కమిటీలు, మూడు జీహెచ్ఎంసీ డివిజన్ల కమిటీలు, మూడు మున్సిపల్ కమిటీల నూతన కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, సోమిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, యువత రాష్ట్ర నాయకుడు మెరాజ్ఖాన్, కృష్ణకాంత్, దశరథ్రెడ్డి, గూడెం విక్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.