మనోహరాబాద్, సెప్టెంబర్ 25 : తూప్రాన్ మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలని మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల నూతన కమిటీ అధ్యక్షుల పేర్లను అధికారికంగా శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో నేడు దేశంలో అందరి చూపు టీఆర్ఎస్ వైపు ఉందన్నారు. ఇతర రాష్ర్టాల్లో టీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారన్నారు. నూతనంగా ఎన్నికైన అ ధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ప్రభుత్వానికి, ప్రజలకు వా రిధిగా నిలువాలన్నారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులను సన్మానించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కమిటీ అధ్యక్షులు వినోద్కుమార్, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, ఏసుదాస్, స్వామి, విఠల్, మల్లారెడ్డి, ప్రశాంత్, జైరాం, నర్సింహులు, సిద్ధిరాంరెడ్డి, స్వామి, వెంకటయ్య, వినోద్ పాల్గొన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ను కలిసిన నూతన మండలాధ్యక్షుడు
చిలిపిచెడ్,సెప్టెంబర్ 25: టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి, నాయకులు హైదరాబాద్కు వెళ్లి రాష్ట్ర మహిళాకమిషన్ చైర్పర్సన్ సునీ త లక్ష్మారెడ్డిని కలిసి సన్మానం చేశారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
చేగుంటలో..
చేగుంట,సెప్టెంబర్ 25: నార్సింగి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన బాబును మండలంలోని సంకాపూర్ టీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు లింగారెడ్డి, సంకాపూర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు యాదగిరి, మోహన్రెడ్డి, సొసై టీ డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు సత్తయ్య, జనగామ మహేశ్గౌడ్, అనిల్గౌడ్, ఎం స్వామి తదితరులున్నారు.
నార్సింగి మండల టీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడిగా రుక్ముద్దీన్
నార్సింగి టీఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షుడిగా రుక్ముద్దీన్ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నార్సింగి మండల పరిధిలోని జెప్తిశివునూర్ గ్రామానికి చెందిన రెండోసారి ఎన్నికైన రుక్ముద్దీన్ను జడ్పీటీసీ కృష్ణారెడ్డి, మైనార్టీ నాయకులు బాకర్, రబ్బాని, ముస్తాక్ సన్మానం చేశారు.
కొల్చారంలో..
కొల్చారం, సెప్టెంబర్ 25: కొల్చారం మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడిగా తుక్కాపూర్ రవీందర్, ఉపాధ్యక్షుడిగా కోనాపూర్ మధుసూదన్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరీశంకర్ సమక్షంలో మండల యువత సమావేశమై తుక్కాపూర్ రవీందర్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంత రం వారిని సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువత నాయకులు రవితేజరెడ్డి, పైతర ఎంపీటీసీ ఎల్ల య్య, టీఆర్ఎస్ నాయకులు కాశినాథ్తో పాటు యువత నాయకులు పాల్గొన్నారు.