నారాయణఖేడ్, సెప్టెంబర్ 18: కులవృత్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నిజాంపేటలో ఏర్పాటు చేసిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల కులవృత్తుల వారిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులు, గంగపుత్రులు, ముదిరాజ్లు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారన్నారు. రజకుల ల్యాండ్రీ షాపులకు, నాయీ బ్రాహ్మణుల సెలూన్ షాపులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, మం డల కోఆప్షన్ సభ్యుడు నవాబ్ఖాన్, సర్పంచ్ జగదీశ్వర్చారి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సత్యపాల్రెడ్డి, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహన్ పాల్గొన్నారు.
కరోనా వ్యాక్సినేషన్ పరిశీలన
నిజాంపేట పీహెచ్సీలో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి
ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాం గ్రెస్, బీజేపీ నాయకుల విమర్శలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే అన్నారు. శనివారం శెట్కార్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఖేడ్, మనూరు, నాగల్గిద్ద మండలాల టీఆర్ఎస్ పార్టీ కమిటీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో నియోజకవర్గంలోని 1.41 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఖేడ్ మండల అధ్యక్షుడిగా పరమేశ్
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా కుమ్మరి పరమేశ్, ప్రధాన కార్యదర్శిగా గోపాల్రెడ్డి ఎన్నికయ్యారు. మనూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా విఠల్రావు, ఎండీ మన్నాన్, నాగల్గిద్ద మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మేత్రి పండరి, రాజ్కుమార్ కంగ్టి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏస్కే గంగారాం, సంజీవ్పాటిల్, కల్హేర్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా రమావత్ రాంసింగ్, పొన్న సాయి లు, సిర్గాపూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దేవకతే సంజీవ్రావు, హన్మంత్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.
సీఎం కేసీఆర్ పథకాలు చరిత్రాత్మకం
కల్హేర్, సెప్టెంబర్ 18 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చరిత్రాత్మమని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఖానాపూర్ కేలోని నివాస గృహం లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరును చూసి కేంద్ర మంత్రులు ప్రశంసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ రాం సింగ్, జడ్పీటీసీ నర్సింహరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, బాచేపల్లి పీఏసీఎస్ చైర్మన్ సంగారెడ్డి, మాజీ ఎంపీపీ పద్మ బాపిరాజ్, రాపర్తి సర్పంచ్ శ్రావణ్కుమార్, మార్డి పీఏసీఎస్ మాజీ చైర్మన్ జలందర్, నాయకులు అంజిరెడ్డి, సంగయ్య, వీఆర్వో వాజీద్ పాల్గొన్నారు.