జహీరాబాద్/ఝరాసంగం, సెప్టెంబర్ 17 : పత్తి పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న 3 వేల గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ధ్వంసం చేశారు. వాటి విలువ మార్కెట్లో రూ.5కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ అశోక్కుమార్ వివరాల ప్రకారం.. ఝరాసంగం మండలం ఏడాకులపల్లి శివారు పొలంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారన్నారని పక్కా సమాచారం వచ్చిందన్నారు. వెం టనే అక్కడికి వెళ్లి, పత్తి పంటను పరిశీలించగా, గంజాయి మొక్కలు గుర్తించామన్నా రు. అక్కడ ఎక్సైజ్ పోలీసు సిబ్బందిని కాప లా ఉంచి, రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చామన్నారు. గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ.5కోట్లు ఉంటుందని ఎక్సైజ్ సీఐ తెలిపారు. గంజాయి మొక్కలు ప్రస్తు తం ఏడో దశలో ఉన్నాయని, కొన్ని రోజుల్లో మార్కెట్కు తరలించే అవకాశం ఉండేందన్నారు. అక్రమంగా పత్తి పంటలో గంజాయి ఎవరు సాగు చేశా రు? భూమి ఎవరిది? అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. పం డించిన గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు. విత్తనాలు ఎవరు ఇచ్చారనేది కూడా విచారిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గంజాయి మొక్కలను పత్తి పొలంలో కాల్చి వేశామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.