వెల్దుర్తి, ఏప్రిల్ 17 : మాసాయిపేట మండలంలోని హల్దీప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా గొలుసుకట్టు పద్ధతిలో చెరువుల్లోకి గోదావరి జలాలను తరలించడానికి కాల్వ పునరుద్ధరణ చేస్తున్నట్లు జడ్పీటీసీ రమేశ్గౌడ్ అన్నారు. శనివారం వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని శేరీ పబ్బ చెరువు వద్ద కాల్వ పునరుద్ధరణ పనులను వైస్ ఎంపీపీ సుధాకర్గౌడ్, ఎంపీటీసీ మోహన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు, నాయకులు నరేందర్రెడ్డి, కృష్ణాగౌడ్, తోట నర్సింలుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ శుక్రవారం హల్దీప్రాజెక్టు వద్దకు మంత్రి హరీశ్రావుకు కాల్వ పునరుద్ధరణ చేసి ప్రాజెక్టు నీటిని కాల్వ ద్వారా చెరువులను నింపాలని కోరారు. స్పందించిన మంత్రి అవసరమైన నిధులను మంజూరు చేసి, పనులను పరిశీలించాలని ఇరిగేషన్ ఎస్ఈ ఏసయ్యను ఆదేశించారన్నారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రాజెకు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను ప్రారంభించామన్నారు. పనులు పూర్తి చేసి శేరీల పబ్బచెరువు, వెల్దుర్తి కుడిచెరువు, ఆరెగూడెం రామిరెడ్డి చెరువు, పంతులపల్లి పంతులు చెరువు, కుకునూర్ ఎల్లమ్మ చెరువులను హల్దీప్రాజెక్టు నీటిద్వారా నింపనున్నట్లు తెలిపారు.
నేడు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల పర్యటన
నేడు వెల్దుర్తి, నెల్లూర్, ఉప్పులింగాపూర్ గ్రామాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ పర్యటించనున్నారన్నారు. నెల్లూర్ పోచమ్మ అమ్మవారికి, వెల్దుర్తి, ఉప్పులింగాపూర్లలో చెక్డ్యాంల వద్ద పూజలు నిర్వహించనున్నారన్నారు. ఉప్పులింగాపూర్లో వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు శేఖర్, శంకర్రెడ్డి, నరేందర్రెడ్డి, ఉప సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు శ్రీను, మహేశ్, కిష్టయ్య, మహేందర్రెడ్డి, రైతులు భూమయ్య, భిక్షపతి పాల్గొన్నారు.
మంజీరా నదిలో చెక్డ్యాం పనులు ప్రారంభం
చిలిపిచెడ్, ఏప్రిల్ 17: నీటి నిల్వతో ఆయకట్టు అభివృద్ధి చెందడంతో పాటు భూగర్భ జలమట్టం పెరిగేలా సీఎం కేసీఆర్ చెక్ డ్యాంలను నిర్మిస్తున్నట్లు ఎంపీపీ వినోదదుర్గారెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఫైజాబాద్ శివారులోని మంజీరా నదిలో రూ.4.75 కోట్లతో చెక్ డ్యాం పనులను సర్పంచ్తో కలిసి ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ మండలంలోని అజ్జమర్రి, ఫైజాబాద్, చండూర్, చిట్కుల్ గ్రామ శివారులోని మంజీరా నదిలో చెక్ డ్యాంలు మంజూరు చేశారన్నారు. చెక్ డ్యాంలు పూర్తయితే బీడు భూములకు సస్యశ్యామలం అవుతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మనోహర నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మల్లమ్మసంగాగౌడ్, ఏఈ ప్రదీప్రెడ్డి, కాంట్రాక్టర్ హుస్సేన్, ఉప సర్పంచ్ రాములు, నాయకులు ఎంసీ విఠల్, శేఖర్, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక.. 64.29 శాతం పోలింగ్
నాగార్జునసాగర్లో ఓటు చైతన్యం