మెదక్ రూరల్, ఏప్రిల్ 15: ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుదన్ని మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్రెడ్డి అన్నారు. గురువారం మెదక్ మండలంలోని మంబోజిపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని హనుమంత్రెడ్డి, సర్పంచ్ గంజి ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. రైతులకు వరి పంటకు క్వింటాలకు ఏ గ్రేడ్కు రూ.1888, బీ గ్రేడ్కు రూ.1868 నిర్ణయించిన ధర లాభసాటిగా ఉందని తెలిపారు. రైతులు వండ్లు ఎండబోసి తాలు లేకుండా 17 శాతం తేమకు మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తయ్య, ఎంపీటీసీ మానస రాములు, వార్డుసభ్యులు ఆంజనేయులు, నాగభూషణం, సెంటర్ ఇన్చార్జి మహేశ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జాతీయ విపత్తుగా కరోనా : ప్రధానికి మహా సీఎం లేఖ
15 నెలల్లో ఈ ఐఐటీయన్ సంపదెంతంటే!