పటాన్చెరు, అక్టోబర్ 14 : విజయదశమి అం దరి జీవితాల్లో విజయాలు తేవాలని శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు డివిజన్లో సాకి చెరువుపై ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎస్పీ రమణకుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీవీ యాంకర్ బిత్తిరి సత్తి, కనకవ్వ బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కనకవ్వ బతుకమ్మ పాటలతో మహిళల్లో జోష్ నింపింది. మహిళలు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా భూపాల్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మగా అభివర్ణించారు. ఉత్తమ బతు కమ్మలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీలు సుప్రజావెంకట్రెడ్డి, కుమార్గౌడ్, సుధాకర్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పానగేశ్, డీఎస్పీ భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారికవిజయ్కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, వెంకట్రెడ్డి, అఫ్జల్, దశరథరెడ్డి పాల్గొన్నారు.