కోహీర్, ఆగస్టు 8: బడంపేట రాచన్నస్వామి దేవాలయంలో సోమవారం నుంచి శ్రావణ మాసోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా శ్రావణం ప్రారంభం నుంచి చివరి వరకు ఆలయ గర్భగుడిలోని శివలింగానికి అభిషేకం, బిల్వార్చన, రుద్రాభిషేకం, తదితర నిత్య పూజలు చేయనున్నారు. ప్రత్యేక వేడుకల నిర్వహణ కోసం ఆలయ ఆవరణలో నూతనంగా రూపొందించిన విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. కోహీర్ మండలంలోని రాచన్నస్వామి దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు కనుల పండుగగా కొనసాగనున్నాయి. లక్ష బిల్వార్చన, కుంకుమార్చన నిర్వహించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాల్లో వారం రోజుల పాటు భజన పోటీలను నిర్వహించనున్నారు.
బడంపేట రాచన్నస్వామి దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. నెల రోజుల పాటు నిర్వహించే లక్ష బిల్వార్చన, కుంకుమార్చనలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న భక్తులు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది.