సంగారెడ్డి మున్సిపాలిటీ, సెప్టెంబర్ 28 : సంగారెడ్డి జిల్లా దవాఖానలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, జిల్లా దవాఖానల్లో సేవలు భేష్గా ఉన్నాయని ఎన్హెచ్ఎం డైరెక్టర్ శ్రీపతి, స్టాటికల్ ఆఫీసర్ శ్రీకాంత్, స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ జేవీఎస్ రావులు కొనియాడారు. మంగళవారం జిల్లా దవాఖాన, ఎంసీహెచ్లను కేంద్ర ఎన్హెచ్ఎం బృందం సభ్యులు సందర్శించారు. ఎంసీహెచ్లోని ఎస్ఎన్సీయూ, ఎన్ఐసీయూ, మెడికల్ ల్యాబ్, ఓపీ, ప్రీ, పోస్ట్ డెలివరీ విభాగాలు, పోషకాహార పునరావాస కేంద్రం, ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాలు, జిల్లా దవాఖానలోని ఓపీ, ఐసీయూ, మెడికల్ ల్యాబ్, తదితర విభాగాలను పరిశీలించారు. ఎంసీహెచ్, జిల్లా దవాఖానలోని రికార్డులు, అటెండెన్స్ రిజిస్టర్లు, పిల్లల నమోదు, డెలివరీల రికార్డులను పరిశీలించారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో సేవలు బాగున్నాయని ఎన్హెచ్ఎం బృందం సభ్యులు తెలిపారు. ఎంసీహెచ్, జిల్లా దవాఖానల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలని సూచించారు. దవాఖానలో అన్ని విభాగాల్లో వసతులు, రికార్డు తీరు బాగున్నాయని తెలిపారు. డాక్ట ర్లు, సిబ్బంది తల్లీబిడ్డలు, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎంసీహెచ్లో డెలివరీలను మరింత పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఆండ్హెచ్వో డాక్టర్ గాయత్రీదేవి, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి, డీఎల్వో మహేందర్రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయకుమారి, డాక్టర్లు గాయత్రీ, అశోక్ పాల్గొన్నారు.