ముషీరాబాద్:సురక్షితంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరుతూ బుధవారం ముషీరాబాద్ డిపో-1 అధికారులు కళాకారులతో బస్సు స్టాప్లలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంనగర్ ఈ సేవా బస్సు స్టాప్, గాంధీ ఆసుపత్రి బస్సుస్టాప్లలో కళాకారులు ఆటా పాటలతో ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉపయోగాలు వివరిస్తూ నృత్యాలు చేశారు.
ట్రాఫిక్ చలానాలు, వాయు కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్రావు ఆదేశాల మేరకు కళాకారుల బృందం ప్రజలు, ప్రయాణికులకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు డిపో మేనేజర్ టీ.శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఇందిర, బుచ్చిరెడ్డి, కళాకారులు విఎస్ గౌడ్, సత్యంలు పాల్గొన్నారు.