కడ్తాల్, మార్చి 22: మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా అభివృద్ధి చేసుకుందామని ఎంపీపీ కమ్లీ మోత్యానాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సభ ప్రారంభంకాగానే వైస్ ఎంపీపీ ఆనంద్ మాట్లాడుతూ కడ్తాల్ మండలంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించారని, అందులో గ్రామాల్లోని సమస్యలను, అభివృద్ధి పనులపై తీర్మానాలు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు స్థల సేకరణ, వెంచర్లలో పది శాతం జీపీ భూమిని గుర్తించాలని తీర్మానించారని, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఎంపీడీవో రామకృష్ణను ఆనంద్ కోరారు. ఆయనకు ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, శ్రీనివాస్రెడ్డి, గోపాల్, రాములుగౌడ్ మద్దతు తెలిపారు. గత సమావేశాల్లో తీసుకున్న తీర్మానాలకు రికార్డులు లేవని అధికారులు తెలుపడంతో, ఈ సభను నిర్వహించడం అర్థ రహితమని, తీర్మానాల పురోగతిపై చర్చించిన తర్వాతే సభ కొనసాగించాలని ఎంపీటీసీ డిమాండ్ చేశారు. సభ్యులు బయటకు వెళ్లిపోవడంతో సభ వాయిదాపడింది. ఈ సమావేశంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఎంపీటీసీలు ప్రియ, ఉమావతి, నిర్మల, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్బాబా, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, యాద య్య, రవీందర్రెడ్డి, సులోచన, భారతమ్మ, హంశ్య, పూజా, భాగ్యమ్మ, సుగుణ, రవీందర్, సేవ్యాబావోజీ, అధికారులు పాల్గొన్నారు.