ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 5 : టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఇబ్రహీంపట్నంలో సంబురాలు అంబరాన్నంటాయి. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని సుమారు గంటసేపు పటాకులు కాల్చారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అంతకుముందు ఇబ్రహీంపట్నంలో దుర్గామాత మండపం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించటం కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్కు పూర్తిస్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ బిట్ల వెంకట్రెడ్డి, నాయకులు వేణుగోపాల్రావు, జెర్కోని రాజు, గరిగె శేఖర్గౌడ్, మైలారం విజయ్కుమార్, కాయితి మోహన్రెడ్డి, హరిప్రసాద్గౌడ్, శివ పాల్గొన్నారు.
షాద్నగర్: షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీ(టీ)ఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్ని అంటాయి. ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పెద్దపెట్టున దేశ్కీ నేత సీఎం కేసీఆర్ అని నినాదాలు చేశారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ప్రధాన పాత్ర వహిస్తారన్నారు. షాద్నగర్ పట్టణ ముఖ్యకూడలిలో టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు డాక్టర్. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్, నాయకులు జూపల్లి శంకర్, వాసవి, ఈగ వెంకట్రాంరెడ్డి, బీష్వ రామకృష్ణ, హన్యానాయక్, నక్కల వెంకటేశ్గౌడ్, రవీందర్రెడ్డి, అశోక్, గుడ్డుయాదవ్, శ్రీనివాస్రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడంతో బుధవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. దేశ్కీ నేత కేసీఆర్ అని నినదించారు. భారతదేశం మార్పు చెందాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని, బీజేపీ విష రాజకీయాలకు ఇక గుణపాఠం తప్పదని ఎమ్మెల్యేలు, నేతలు అన్నారు.
ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేస్తూ జాతీయ పార్టీగా ప్రకటించడంపై బుధవారం ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్ -శ్రీశైలం రహదారిపై టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. జై బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ పత్యానాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్రావు, ఎంపీటీసీ కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తల్లోజు రామకృష్ణ, సయ్యద్ ఖలీల్, నాయకులు బాలస్వామి, వెంకటేశ్, రమేశ్, మల్లేశ్ నాయక్, అల్లాజీ, పర్వతాలు, యాదయ్య, ఆనంద్, జంతుక కృష్ణ, హనీఫ్, అప్సర్, గుత్తి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
మాడ్గుల : టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు జంగయ్యగౌడ్, రమేశ్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ రాములు, ఏఎంసీ డైరెక్టర్ సుభాశ్, రాజు, రమేశ్, కుమార్ తదితరులు ఉన్నారు.
మంచాల మండలంలో..
మంచాల : మండలంలలోని వివిధ గ్రామాల్లో బీ(టీ)ఆర్ఎస్ కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. పటాకులు కాల్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో భారతదేశంలో పెను మార్పులు వస్తాయని, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చీరాల రమేశ్, కావలి శ్రీనివాస్, చిందం రఘుపతి, మార సురేశ్, కందాల శైలం, చిందం జంగయ్య, పున్నం రాము, అంతటి రాజు, ఎండీ జానీపాషా, మొర్రి ఐలయ్య, సతీశ్ యాదవ్, మహేందర్ పాల్గొన్నారు.
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడంతో మండలంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. రావిచేడ్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా నాయకులు సీఎం కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు లాయక్అలీ, డాక్టర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకుడు మహేశ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రమేశ్యాదవ్, వెంకటేశ్, నాయకులు రంగయ్య, రవికుమార్, కృష్ణ, శ్రీకాంత్, శ్రీను, ఖాలేద్, శ్రీను, శివ, రమేశ్, వెంకటేశ్, కేశ్యానాయక్ పాల్గొన్నారు.
కేశంపేట : మండల కేంద్రంలో, ఎక్లాస్ఖాన్పేటలో బీ(టీ)ఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. భారత రాష్ట్ర సమితికి జై అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో మాదిరిగానే దేశంలో కూడా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, నాయకులు జమాల్ఖాన్, వెంకన్నయాదవ్, శేఖర్పంతులు, పర్వత్రెడ్డి, సురేశ్, కార్యకర్తలు ఉన్నారు.