కొత్తూరు, అక్టోబర్ 1: ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ, మండలంలోని వివిధ సంక్షేమ పథకాల ఫలాలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లబ్ధిదారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడంలేదన్నారు. కొత్తూరు మండలానికి చెందిన 27 కల్యాణలక్ష్మి, 5 షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాయలంలో అందజేశారు. మున్సిపాలిటీకి చెందిన 240 మందికి ఆసరా పెన్షన్ కార్డులు, 80 వీధి వ్యాపారులకు గుర్తుంపు కార్డులు రాధా గార్డెన్లో అందజేశారు.
కొత్తూరు మండలంలోని సిద్దాపూర్ నుంచి చింతగుట్ట తండా వరకు బీటీ రోడ్డు మరమ్మతులు పనులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శనివారం ప్రారంభించారు. రూ. 35 లక్షలతో రోడ్డు మరమ్మతులు చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
తెలంగాణ ఆడ పడుచుల ఆత్మ గౌరవానికి బతుకమ్మ చీరలు ప్రతీకగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో ఎమ్మెల్యే బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ ఎంపీపీ మధుసూదన్రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైఎస్ ఎంపీపీ శోభ లింగం నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ డొలి రవీందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాస్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొస్గి భగవద్గీత, ఎంపీడీవో శరత్చంద్రబాబు, తహసీల్దార్ రాములు, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, సీఐ బాలరాజు పాల్గొన్నారు.