రంగారెడ్డి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) / బడంగ్పేట : ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే పూలను పూజించే పండుగ నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ బతుకమ్మ ఘాట్ వద్ద శనివారం సాయంత్రం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.
వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి సబితారెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మ పండుగను మహిళలంతా ఒకచోట చేరి తొమ్మిది రోజుల పాటు సంతోషంగా అత్యంత వైభవంగా జరుపుకోవడం అద్భుతమని పేర్కొన్నారు. వేడుకల్లో మీర్పేట మున్సిపల్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.